మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు టిడిపి జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రతి విషయంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ఎప్పుడూ అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. విమర్శలు చేస్తూ ఉంటారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీటీడీ భూముల వేలానికి సంబంధించి స్పందించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పలు విమర్శలు గుప్పించారు. 

 

 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని  టార్గెట్ చేస్తూ ఈ విమర్శలు చేశారు నారా లోకేష్. పదవి కోసం ఏకంగా తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి... దేవుడి మాన్యాలను వదిలిపెడతాడు అని అనుకోవడం నిజంగా అత్యాశే అవుతుంది... భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీవారికి ఉంది.. గోవిందా గోవిందా అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు నారా లోకేష్. అంతేకాకుండా తన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో వచ్చిన వార్త కథనాన్ని కూడా పోస్ట్ చేశారు. 

 

 అత్యంత ధనవంతుడైన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టింది అంటూ సదరు వార్త పేపర్ కథనంలో ఉంది. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి పై భక్తితో  ప్రపత్తులతో ఎంతో మంది దాతలు విరాళంగా సమర్పించుకున్న ఆస్తులకు ప్రస్తుతం అర్థం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం ఏకంగా శ్రీ వారి ఆస్తులను కూడా వేలం పెట్టి అమ్మేందుకు సిద్ధమయ్యారు అంటూ నారా లోకేష్ పోస్ట్ చేసిన ఆ పత్రికలో ప్రచురించారు. టీటీడీ భూముల విక్రయానికి ఇప్పటికే కొన్ని బృందాలను కూడా ప్రభుత్వం నియమించింది అంటూ సదరు వార్తా పత్రికలో పేర్కొన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ పెట్టిన పోస్ట్ కాస్త  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: