గత కొద్ది రోజులుగా దేశంలో మళ్లీ దారుణాలు ఎక్కువైపోతున్నాయి. భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో మరోసారి దారుణ సంఘటన జరిగింది. ఒక దొంగ ఇంట్లో చోరీకి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కీచకుడు. ఢిల్లీ నగరంలో ఒక ప్రాంతంలో నివసించే సదరు యువతి శనివారం నాడు ఇంటి బాల్కనీలో కూర్చుని మొబైల్ చూస్తూ ఉంది. ఇక ఆ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ బయటికి వెళ్లడంతో ఆ అమ్మాయి ఒకటే ఇంట్లో ఉండి పోయింది. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన ఆ దొంగ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.

 


ఇక చొరబడిన తర్వాత ఆ అమ్మాయిని బెదిరించి నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగ దోచుకున్నాడు. ఇకపోతే ఇదే సమయంలో ఆమె పర్సు లో ఉన్న ఏటీఎం కార్డు కూడా లాగేసుకున్నాడు. అయితే ఆ కార్డు పిన్ చెప్పాలని అతడు ఆ యువతిని కోరగా ఆ అమ్మాయి దానికి నిరాకరించింది. ఈ విషయంలో చాలాసార్లు ఆమెను అడగగా సదరు యువతి పిన్ చెప్పకపోవడంతో ఆగ్రహించిన ఆ దొంగ ఆమెను మంచానికి కట్టేసి దారుణంగా అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఆ తర్వాత కొద్ది సేపటికి తేరుకున్న యువతి పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని తెలియజేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సదరు యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ దొంగ తనపై అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నం చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దొంగ కోసం తీవ్ర ప్రయత్నం చేసి చివరకు ఆదివారం నాడు ఆ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: