గత కొన్ని రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పటి నుంచే కాదు ఏపీ ఎన్నికలకు ముందు నుంచి మై ఛానల్ నా ఇష్టం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి అందులో టిడిపి పై విమర్శల తో దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఎంతగానో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రతి  విషయంలో స్పందిస్తూ తనదైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. 

 


 మొన్నటికి మొన్న గాడ్సేని అసలు సిసలైన దేశభక్తుడు అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబడుతూ క్షమాపణ చెప్పాలంటూ కోరి మరోసారి సంచలనం సృష్టించారు. అంతే కాకుండా తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులందరు లో రక్తం చల్లబడిపోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. 


 భారతీయులందరి రక్తం శాంతి అహింస అనే మంత్రాలతో చల్లబడిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. చల్లబడిపోయిన భారతీయులందరి రక్తం మళ్ళీ తిరిగి వేడెక్కాలి అంటే... శివాజీ, రాణా ప్రతాప్,  అశోక చక్రవర్తి లాంటి వారి జీవిత గాథలను వినిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించారు మెగా బ్రదర్ నాగబాబు. ఇలాంటి కథలను పిల్లలతో చదివితే నెక్స్ట్ జనరేషన్ లో అయినా గుండా రాజకీయ నాయకులు, కుహాన ఉదారవాదులు,  ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడే వీరుడు తయారవుతారు అంటూ వ్యాఖ్యానించిన  నాగబాబు... ఇదే నా కోరిక అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి నేరాన్ని పోలీస్ మిలిటరీ మాత్రమే డీల్ చేయాలంటే కుదరని పని అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా  బ్రదర్ జనసేన నేత నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: