రిజర్వు బ్యాంక్  రైతులకు, వ్యాపారులకు సువర్ణావకాశం కలిపిస్తోంది. మరి ఈ అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారా... ?, అయితే దీని ద్వారా ఏ బెనిఫిట్స్ వస్తాయి... ?, ఎలా దీనిని వినియోగించుకోవచ్చు.. ? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వచ్చేస్తుంది. మరి చదివేయండి అప్పుడు మీకు దీని మీద పూర్తి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు  ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ప్రయోజనాన్ని మరింత విస్తరించింది.

దీనితో స్టార్టప్స్, రైతులు ఎంతో సులువుగా రుణాలు పొందొచ్చు. రూ. 50 కోట్ల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పింది రిజర్వు బ్యాంక్. అయితే ఇందులో కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా రైతులు కూడా ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది . అది ఎలా అంటే...? సోలార్ ప్లాంట్స్, కాంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంటు వంటి వాటి ఏర్పాటుకు రైతులు కూడా ఈ ప్రయోజనం కింద రుణాలు ఇప్పుడు తీసుకోవచ్చు. చూసారా...!  ఈ సరి కొత్త నిర్ణయం ఎలా ఉపయోగపడుతుందో.

నిబంధను సమీక్షించి ఆర్‌బీఐ శుక్రవారం ప్రియారిటీ సెక్టార్ లెండింగ్  మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలను సరళీకరించిన తర్వాత ఇప్పుడు రైతుు , బలహీన వర్గాలు సులభంగానే రుణం పొందొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు కూడా అధిక రుణ మంజూరీకి ప్రయత్నిస్తున్నామని చెప్పింది రిజర్వ్ బ్యాంక్.

దీని ద్వారా బ్యాంకులు స్టార్టప్స్‌కు ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కింద రూ. 50 కోట్ల వరకు రుణాలు అందిస్తాయని ఆర్‌బీఐ తెలపగా.... క్షేత్ర స్థాయి లో కూడా ఈ ప్రయోజనాన్ని అర్హులకు అందిస్తామని రిజర్బ్ బ్యాంక్ అంది. అంతే కాకుండా  రైతులకు కొత్త బిజినెస్ ఏర్పాటుకు కూడా రుణాలు కల్పిస్తున్నట్టు తెలిపింది . పలు జిల్లాలకు కూడా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: