ఇటీవలే పాకిస్తాన్ లో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలకు మూలకారణాలను పరిష్కరించాలంటూ ఇటీవలే ఓ సంఘం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే మహిళా సంఘం అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ లో అసలు అత్యాచారాలు జరగడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని బయటపెట్టారు ఆ సంఘం నాయకురాలు. అయితే పాకిస్తాన్ లో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని... అసలు మహిళలకు ఎక్కడా రక్షణ అనేది లేకుండా పోయింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ నీచమైనటువంటి విషయం ఏమిటి అంటే మహిళలపై అత్యాచారం చేస్తుంది ఎవరు కాదు ఏకంగా సొంతవారే అన్న విషయం కూడా బయటపెట్టింది సదరు మహిళ.
వివిధ కేసుల ఆధారంగా సేకరించిన వివరాల ప్రకారం అత్యాచార నిందితుల్లో 82 శాతానికి పైగా కుటుంబ సభ్యుల కారణమవుతున్నారు అంటూ సదరు మహిళ తెలిపారు. ఇలా అన్న, తమ్ముడు, తండ్రి వరుసల వారే దారుణంగా మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రోజురోజుకీ పాకిస్థాన్ లో మహిళలకు సొంతింటి వారి నుంచి కూడా రక్షణ కరువైంది అన్న విషయాన్ని తెలిపింది. అత్యాచారం నుంచి బయటపడిన ఎంతోమంది మహిళలు న్యాయం చేయాలంటూ తమను ఆశ్రయించారు అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఆ మహిళ సంఘం నాయకులను. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి