ప్రతి ఏడాది మూడు దఫాలుగా పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. కాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం లో అర్హులందరికీ ఖాతాల్లోకి 2000 జమ చేయనుంది జగన్ సర్కార్. ఈ కార్యక్రమాన్ని నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఆన్లైన్ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక ఈ రెండో విడతలో భాగంగా దాదాపుగా రెండు వేల రూపాయల సహాయాన్ని రైతులందరి ఖాతాలో జమ చేయనున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులకు 1114 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
దీంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడి సాయం తో పాటు ఇప్పటికే వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్రెడ్డి సర్కార్ నడుంబిగించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీ పంట నష్టం ఏర్పడింది. లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట దగ్ధమైంది.ఈ క్రమంలో రైతులందరూ అయోమయ స్థితిలో పడిపోయారు. అయితే వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్.