ఆ ఊరిలో వారి మాటే వేదం.... చెప్పిన ధరకు పొలాలు విక్రయించక పోయినా... తాము అనుకున్న వ్యక్తి వారి బాటలో నడవక పోయినా అక్కడ శిక్ష తప్పదు.... బంగారంలా పండే పొలం ఉన్నా... బీడులా  మారి పోవాల్సిందే. ఇంతకీ ఆ ఊరు మరేదో కాదు..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడ. ఆ గ్రామంలో ఇప్పటికీ అలా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.... మన రాత ఇంతే అని సరిపెట్టుకుంటే.  మెండ రామ్మూర్తి అనే రైతు మాత్రం అన్యాయాన్ని వేలెత్తి చూపుతూ... తన బాధను వ్యక్తపరిచాడు.

ఈ రైతుకు చెందిన 18 ఎకరాల భూమిని అచ్చెన్నాయుడి అండతో సోదరుడు కింజరపు హరి ప్రసాద్‌ తన స్వాధీనం చేసుకోవాలని  ప్రయత్నించినట్లు తెలిపారు. వారు  చెప్పిన ధరకు భూములు విక్రయించేందుకు అంగీకరించలేదని రామ్మూర్తిపై, కుమారుడిపై దౌర్జన్యాలకు పాల్పడటంతో వారు గత్యంతరం లేక వేరే గ్రామాల్లో తలదాచుకున్నారు. కుమారుడు బంజీరు పేటలో, రామ్మూర్తి పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి గ్రామాల్లో అద్దె ఇళ్లల్లో ఉన్నారు.

మెండ రామ్మూర్తి అనే రైతుకు గ్రామం చుట్టు పక్కల 18 ఎకరాల భూములు ఉన్నాయి. అచ్చెన్నాయుడు, హరి ప్రసాద్‌ కుటుంబంకు అనుకూలంగా వారికి పొలాలను అప్పగించకుండా ఎదురు తిరిగామన్న కక్షతో పంటలు పండించకుండా చేస్తున్నారు. తక్కువ ధరకు ఇవ్వమని బాధిస్తున్నారు అంటూ వాపోయాడు. అంతేకాదు ఆ రైతు ఏమన్నాడంటే ....ఇటీవల సొంతింటికి వచ్చిన నాపై ఇప్పుడు కూడా బెదిరింపులు ఎదురయ్యాయి. నాకు ఎవరైనా సాయం చేస్తే వారికి ఇబ్బందులు తప్పవంటూ హరి ప్రసాద్‌ హెచ్చరిస్తున్నాడు.... అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రైతు.  ఇలాంటివి ఇంకా కొనసాగుతుండటం చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఇది తెలిసిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది తెలిసిన ప్రభుత్వం వీరిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: