ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం లో ఉగ్రవాదులు బెడద రోజు రోజుకు ఎక్కువవుతోంది అనే విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ అంతా తమ ఆధీనంలో నే ఉంది అని అనుకుంటున్న తరుణం లో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదులు అందరికీ భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాశ్మీర్ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితిలో తమ ఆధీనంలోకి ఉంచుకోవాలి అని భావిస్తున్న ఉగ్రవాదులు కాశ్మీర్లో ప్రజలందరికీ భయభ్రాంతుల కు గురి చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కొంతకాలం నుంచి వరుసగా కాశ్మీర్ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతుల కు గురిచేస్తున్నారు. అయితే మత రాజ్యస్థాపన చేసి వివక్షకు గురవుతున్న తమ వర్గానికి రక్షణ కల్పించాలన్నదే ఉగ్రవాదం ఉద్దేశం అని చెబుతున్నారు. కానీ ఇటీవల ఏకంగా భారత్లో ముగ్గురు ముస్లింలను కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఫిదా హుస్సేన్ యటు, ఉమెర్ రషీద్ బేక్, ఉమెర్ రంజాన్ హజం అనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చిచంపారు.ఇలా తమ వర్గం దేశం కావాలని చెబుతున్న ఉగ్రవాదులు తమ వర్గానికి చెందిన వారిని చంపుతూ ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా ఈ మధ్య కాలంలో కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. దీంతో సైన్యం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది.