కానీ ఆయన ఘన విజయం అనంతరం మాట తీరు చాలా మారిందని కామెంట్లు వస్తున్నాయి. కొన్నిసార్లు ఆయన ప్రస్తావించే అంశాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఒకటి రఘునందన్ ఇప్పుడు విమర్శల పాలు చేసింది.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా... ఆ సందర్భంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్ దివంగత మహానేత.. వైఎస్ ను ఉద్దేశించి మాట్లాడే సమయంలో నోరు జారారు... అంతటి మహా వ్యక్తిని.... అందులోనూ స్వర్గస్తులైన వ్యక్తిని గురించి దారుణమైన రీతిలో నోరు జారి ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకున్నారు రఘునందన్.
ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన ముందు వెనుక ఆలోచించకుండా... దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి గురించి ప్రస్తావించిన తీరు అందరినీ బాధించింది...."నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతా.. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి గట్లే పోయిండు.. పావురాల గుట్టల" నువ్వు కూడా చివరాకరికి గంతే.. యాక్షన్కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అంటూ రఘునందన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వస్తుందని ఉదాహరణ ఇస్తూ చెప్పడం రఘునందన్ ను చిక్కుల్లో పడేసింది.
రఘు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు... అంత సింపుల్ గా ఇంత మాట ఎలా అన్నారంటూ ఇబ్బంది పడుతున్నారు. అంతే కాదు.. రఘునందన్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నత పదవిలో కొనసాగుతుండగా...బీజేపీకి ఓటు వేయొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని.. ప్రజల్ని కోరుతున్నారు. ఇటువంటి కార్యకర్త తన బాధ్యతను ఎలా చక్కగా నిర్వహిస్తారంటూ విమర్శిస్తున్నారు. తన తూలిన మాట వలన.... పార్టీ ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో.... మరి ఎంత నష్టంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన రఘునందన్.. తన మాటను వెనక్కి తీసుకో లేకపోయినప్పటికీ..... వెంటనే నష్టనివారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని.. నిజానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని.. వైఎస్ కుటుంబంపై తనకు ఎలాంటి విరోధం లేదని తెలియజేశారు.
గతంలో వైఎస్ కటుుంబంపై కేసీఆర్ మాట్లాడిన మాటల్ని తాను గుర్తు చేసినట్లుగా చెప్పారు. గతంలో తాను వైఎస్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ.... తను జారిన మాటను సరిచేసుకోవాలని ప్రయత్నించారు రఘు నందన్. తను మాట్లాడిన మాటలకు అర్థం అది కాదని నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను తప్పుగా మాట్లాడలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే.. తప్పుగా అర్థమైతే తనను క్షమించాలి అంటూ క్షమాపణ కోరారు. అలా ఆయన తన వైపు నుండి వివరణ ఇవ్వగా ... మరి ఈయన మాటలు, మరియు క్షమాపణల్ని
వైఎస్ కార్యకర్తలు అభిమానులు స్వీకరిస్తారో లేదో చూడాలి. అందుకే మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి... అందులోనూ
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే సమయంలో.. మరింత ఆలోచించి బాధ్యతగా..... వ్యవహరించాలని అంటారు. ఒకసారి అది తప్పాక... ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు విషయం చక్కపడకపోవచ్చు. మరి ఇప్పుడు రఘునందన్ వివరణాత్మక క్షమాపణలు వైయస్సార్ పార్టీ అభిమానులను సంతృప్తి పరుస్తాయో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి