ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని బైక్ లలో  ఎక్కువగా క్రేజ్ వున్న బైక్ ఏది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ప్రస్తుతం మాత్రమే కాదు ఎన్నో ఏళ్ల నుంచి అటు మార్కెట్లో టాప్ బైక్ గా  కొనసాగుతూ వస్తుంది ఈ బైక్.  ఇక రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడ్  చేస్తుంటే ఎంతో రాయల్ గా ఉంటుంది అని యువత ఈ బైక్ ను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.  అయితే ఈ బైక్ రాయల్ గా ఉండటమే కాదు వాహనం ధర కూడా భారీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ బైక్ కొనాలని ఉన్నప్పటికీ ధర చూసి అందరూ వెనక్కి తగ్గుతూ ఉంటారు.


 అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పూణే లోని ఒక రెస్టారెంట్ వినూత్న ఆలోచన తో ప్రస్తుతం తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక కాంటెస్ట్ పెట్టింది.  భారీ భోజనం పూర్తి చేసి బుల్లెట్ బైక్ సొంతం చేసుకునేందుకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. పూణేలోని శివాజీ హోటల్ ఈ ఆఫర్ ప్రకటించింది. కేవలం 60 నిమిషాల్లో నాలుగు కిలోల నాన్ వెజ్ భోజనాన్ని పూర్తిగా తినాలని.. ఇలా చేస్తే విజేతకు 1.65 లక్షల విలువచేసే బుల్లెట్ బైక్ బహుమతిగా ఇస్తాం అంటూ ప్రకటించింది.


 అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ను తీసుకువచ్చామని రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు. ఇక ఈ పోటీలో పాల్గొన్న వారు గెలిస్తే ఇచ్చేందుకు ఇప్పటికే కొత్త బుల్లెట్ బైక్ లను ఐదింటిని రెస్టారెంట్లో సిద్ధంగా ఉంచారు. అంతే కదూ ఇక ఈ ఆఫర్ అందరికీ తెలిసేలా ఒక పెద్ద బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ భోజనంలో ఏం వుంటాయి అనే దానికి సంబంధించిన మెనూ కూడా బ్యానర్ లో పెట్టడం గమనార్హం.ఈ భోజనంలో మొత్తం 12 రకాల వంటకాలు 4కేజీల బరువుతో ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పొంఫ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. మరికొన్ని ఉన్నాయి. ఈ కాంటెస్ట్కు మంచి స్పందన వస్తోందని, చాలా మంది ఎగబడి మరీ ఈ కాంటెస్ట్ లో పాల్గొంటున్నారు. కాగా ఈ బుల్లెట్ భోజనం ధర రూ.2500

మరింత సమాచారం తెలుసుకోండి: