కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎంతలా పడిందో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గతంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడు మూతపడిన విద్యాసంస్థలు మొన్నటికి మొన్న తెరుచుకున్నాయి ఇక విద్యా సంస్థలు తెలుసుకున్నాయో లేదో మరోసారి  వైరస్ కేసుల సంఖ్య విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి విద్యారంగం కాస్త సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య కఠిన ఆంక్షలు మధ్య ఇక ప్రస్తుతం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలను పూర్తిగా మూసి  వేయడమే కాదు పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.



 కానీ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం పరీక్షలపై ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఇలాంటి నేపథ్యంలో అటు విద్యార్థులందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి కూడా ఇదే విధంగా మారిపోయింది. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు అదే సమయంలో పరీక్ష నిర్వహణ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అని చెప్పాలి.  పరీక్షలు నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అనే దానిపై అటు విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 పరీక్షల నిర్వహణపై ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు  టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ మార్కులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అంటూ చెప్పుకొచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకే షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రస్తుత మార్కులనే భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు పరిగణలోకి తీసుకుంటాయి అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడాలి అన్నా ఇక అటు ముఖ్యమైన విద్యా సంస్థల్లో సీట్ సంపాదించాలి అన్న కూడా మార్కులు ఎంతో ముఖ్యం గా మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. బాగా చదివిన విద్యార్థులకు నష్టం వాటిల్ల కూడదు అనే ఉద్దేశంతోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది అంటూ చెప్పుకొచ్చారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: