మన దేశంలో టీకా ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. అప్పటివరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రజానీకం సైతం ఇక ఇలాంటి అపోహలు అనుమానాలతో వ్యాక్సిన్ కి దూరంగానే ఉన్నారు అని చెప్పాలి. కాని ప్రస్తుతం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పై అవగాహన తెచ్చుకుని చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ గురించి గొప్ప విషయం వెల్లడించాడు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరుణ కరోనా బారిన పడిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గింది అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రెండు డోసులు టీకా తీసుకున్న పదివేల మందిలో కేవలం ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే కారణం వైరస్ మరణం బారిన పడ్డారు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐ సి ఎం ఆర్ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం.. భారత్లో తయారైన ఎటువంటి కోవిషీల్డ్ ఇప్పటివరకు 1.1 కోట్ల మంది తీసుకోగా ఇందులో 93 లక్షల మంది మొదటి డోసు వేసుకోగా 17 లక్షల మంది రెండు డోసులు వేసుకున్నారు. అయితే మొదటి డోసు తీసుకున్నవారిలో 4802 మంది కరోనా వైరస్ బారిన పడితే రెండవ డోస్ తీసుకున్నవారిలో కేవలం 695 మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారు. అంతేకాకుండా కోవాక్సిన్ విషయానికి వస్తే.. 11.6 కోట్లమంది ఇప్పటివరకు టీకా తీసుకోగా 17 వేల నూట నలభై ఐదు మందికి తొలిరోజు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రెండు డోస్ తీసుకున్న తర్వాత కోటిన్నర మందిలో కేవలం 5000 మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారని విషయాన్ని తెలిపి అందరిలో ధైర్యం నింపింది కేంద్ర ప్రభుత్వం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి