ఒకవైపు ఏపీకి మరియు తెలంగాణకు మధ్యన జలవివాదం ఎంతలా ముదిరిపోతుందో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అంశంపై మాట్లాడని టీడీపీ నాయకులు, వివిధ అంశాలపై మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అందరికీ క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అవసరం లేని, ప్రజలకు ప్రయోజనం కాని అంశంపై నిరసనలు చేస్తూ మరోసారి టీడీపీ పరువు తీస్తున్నారు. ఇందులో భాగంగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కూడా వీరికి సొంతంగా ఆలోచన వచ్చి ఉంటే సరే, కానీ మాజీ టీడీపీ నాయకుడు మరియు ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ పెట్రోల్ మరియు డీజిల్ అంశంపై ఆందోళనలు చేపడుతున్నారు.
రేవంత్అ రెడ్డి లాగా చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న టీడీపీ నాయకులలో ఎవ్వరూ రేవంత్ రెడ్డిలాగా లేరని అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఏపీకి మద్దతుగా జల వివాదంపై ప్రభుత్వానికి అండగా నిలబడి పోరాటం చేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన. మరి ఇక ముందైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలపై టీడీపీ తమ్ముళ్లు గళం విప్పుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది..