అంతే కాకుండా అమృత్ సర్ ప్రాంతమంతా సిద్దు బ్యానర్ లతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా పాల్గొనడం విశేషం. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మదన్ లాల్ జల్ పూర్ మాట్లాడుతూ రానున్న పంజాబ్ ఎన్నికలలో సిద్దు నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపారు. సిద్దు పీసీసీ అధ్యక్షుడు కావడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు కూడా సిద్దూనే కావాలని అనుకుంటున్నారని సంచనలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కు సీఎం నుండి ఉద్వాసన తప్పేలా లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
అంతే కాకుండా ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం అమరీందర్ సింగ్ పాత విషయాలన్నీ వదిలి పెట్టి, కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సిద్ధుని కలిసి అభినందించాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయటానికి ఇద్దరూ కలిసి పనిచేయాలన్నారు. కానీ అమరీందర్ సింగ్ మారేలా కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ సీఎం అవడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.