తెలంగాణ ధాన్యం కొనకుండా కేంద్రం వేధిస్తోందంటున్న కేసీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసురుతున్నారు. కేంద్రాన్ని విమర్శిస్తూ కేసీఆర్ చేసిన ప్రకటన పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులని మోసం చేస్తున్నాయంటున్న ఎంపీ కోమటిరెడ్డి..
కేసీఆర్ రైతులకోసం జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరహర దీక్షకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా..? అంటూ సవాల్ విసురుతున్నారు. కేసీఆర్ యాసంగిలో  వడ్లను కొనను అని ప్రకటించటం పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.


కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారంటే.. “ కేంద్రం పేరు చెప్పి వడ్లను కొనను అని చెప్పటం దారుణం.. కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి.. కేసీఆర్.. నీకు..  చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయి.. కేసీఆర్ రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయి.. నేను కూడా పాల్గొంటాను.. తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టి వచ్చాను అని చెప్పుకుంటావు కదా.. మరి కేంద్రం పై ఎందుకు పోరాటం చేస్తలేవు" అని కోమిటిరెడ్డి ప్రశ్నించారు.


తెలంగాణ అంటేనే పోరాటం.. మనం ఇలా చేతులెత్తేయొద్దు.. ఉత్తరాద్రి రైతులు లాగా పోరాటం చేద్దాం.. మూసీ ప్రవాహిత మరియు సాగర్ ప్రాంతాలలో వరి తప్ప ఇంకేం పంటలు పండవు వారి పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలి..?
మీ ప్రకటనలతో రైతులు రోడ్లపైన పడతారు.. ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనాల్సిందే.. 5 లక్షల కోట్ల అప్పులు చేశావు రైతుల కోసం 20 వేల కోట్లు కేటాయించలేవా..? రాష్ట్రంలో 50 శాతం భూముల్లో వరి తప్ప ఇంకేం పండవు అని నీకు తెలుసు.. తెలంగాణ లో కౌలురైతుల పరిస్థితి ఏంటి..?
 కేసీఆర్ కేంద్రం పై సాకు పెట్టి వడ్లు కొనకుంటే ఊరుకునేది లేదు.. కొనాల్సిందే.. కేసీఆర్.. నీకు చేతకాకపోతే రాజీనామా చేయి.. మేము కేంద్రంతో పోరాడతాం.. రైతులకు న్యాయం చేస్తాం.. అంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: