తెలంగాణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ప్రఖ్యాతిగాంచినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మేడారం జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది అన్న విషయం తెలిసిందే. మేడారం జాతర కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతుండగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్మించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఇక జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే టీఎస్ ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరకు ప్రయాణమై భక్తుల కోసం 3845 బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా ఇక మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.. కరోనా వైరస్ శానిటేషన్ వంటి ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందట. అయితే దాదాపు 3845 బస్సులు నిలిపేందుకు గానూ అటు మేడారంలో 50 ఎకరాలలో భారీ బస్టాండు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మేడారం యాత్ర కోసం భారీగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండడంతో అటు ఎంతో మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి