దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడం ఓవంతు దేశానికి రాజ్యాంగం ప్రసాదించి ఓ గొప్ప ప్రక్రియకు పూనిక వహించడం ఓ వంతు.. ఆ ప్రక్రియకు అంబేద్కర్ సారథ్యం వహించారు. ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకుంటున్న ప్రస్తుత తరుణాన స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన వేళ అంబేద్కర్ కు మరో సారి ఓ గొప్ప గౌరవం అందించాలని జనసేన ప్రతిపాదిస్తుంది. ఆ విధంగా చేస్తే గొప్ప వారి పనులకు గొప్పవారి ఆశయాలకు మరింత గుర్తింపు ఇచ్చిన వారం అవుతామని అభిలషిస్తోంది.దటీజ్ జనసేన..అవును! ఆ ఆలోచన ఎంతో బాగుంది. అంబేద్కర్ గారికి నివాళి ఇస్తూనే ఇటువంటి మంచి పనులు చేయాలి.. ఇంతకూ ఆ ప్రతిపాదిత స్వరం ఏంటంటే.. ఎవరిదంటే ఏమన్నదంటే.. ఆ వివరం ఈ కథనంలో!
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలాచోట్ల నిరసనలు వస్తున్నాయి. చాలా చోట్ల కొత్త కొత్త ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన కూడా తనదైన ప్రతిపాదన చేసింది. ఓ విధంగా జనసేన గూటి నుంచి ఆయన బయటకు వచ్చినా, సాంకేతికంగా ఇంకా ఆయన ఆ పార్టీ సభ్యులే! ఆయనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. అవును! ఆయన ఇప్పుడు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటయ్యే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించారు. ఆ విధంగా చేస్తే ఆ మహనీయుడిని స్మరించుకుంటూనే, గౌరవించినవారం అవుతామని ఆయన అభిప్రాయపడుతున్నారు.తన నియోజకవర్గంలో ఎక్కువ ఎస్సీలే ఉన్నారని, అదేవిధంగా కోనసీమలో మెజార్టీ నియోజకవర్గాలు అన్నీ దళిత ప్రభావిత ప్రాంతాలే అని..కనుక దళిత జన ఉద్ధారకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు మనం సముచిత గౌరవం ఇవ్వడమే కాకుండా ఆ మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయడం కూడాఓ బాధ్యతగా చేసుకోవాలని రాపాక ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి