అతి ఆవేశమే అనర్థానికి కారణం
మొదటి సారి ఎమ్మెల్యేగా అయిన వెంటనే కొద్ది రోజుల వ్యవధిలో ఆయన స్పీడు నచ్చి,కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మత్స్య శాఖతో పాటు పశుసంవర్థక శాఖ కూడా కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పంథానే మారిపోయింది.రివ్యూ మీటింగుల్లో ఎక్కువగా ఆయన అరుస్తారు. మంత్రి అనే హోదా మరిచి అధికారులను తిడతారు అన్న అభియోగాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన ఆవేశంలో ఉన్నప్పుడు అదుపుతప్పి మాట్లాడడమే కాకుండా చేయి చేసుకునేందుకు కూడా వెనుకాడరు అన్నది ఆయనకున్న మరో అవలక్షణం.
గతంలోనూ ఇలాంటి వివాదాలే నెలకొన్నాయి.కానీ అవన్నీ పలాస వరకూ ఆగిపోయి మంత్రి పరువును కాపాడాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబంతోనూ ఆయన కుమార్తె గౌతు శిరీష(మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఈమె)తోనూ విభేదాలు ఉన్నాయి.సోషల్ మీడియాలో ఆ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవే కాకుండా చాలా వివాదాలు ఉన్నాయి.ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన రియల్ ఎస్టేట్ వివాదాలను, భూ కబ్జాలను నిలువరించలేకపోతున్నారు అన్న అభియోగాలను మోస్తున్నారు.పలాస కేంద్రంగా ఆరోజు గౌతు శ్యామ సుందర
- రత్నకిశోర్ శంభుమహంతి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి