సర్వే ప్రకారం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఎవరిమీద ఆధారపడకుండా తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీకే టీం స్పష్టం చేసింది. ఇక రెండవ స్థానంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పారు. కాగా గత రెండు సంవత్సరాల నుండి ఎంతో హల్ చల్ చేస్తున్న బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలకు చాలా దూరంలో నిలిచిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీజేపీ జాడ కూడా లేదని పీకే టీం సర్వే చెప్పింది. ఇక ముందు నుండి చెబుతున్నట్లుగానే కొంతమంది తెరాస నేతల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని, అలాంటివారిని తప్పక మార్చాల్సిందేనని పీకే గట్టిగా చెప్పారు.
ఇంకా కొంచెం సమయం ఉన్నందున ఆ నేతలు ప్రజలకు చేరువగా వెళ్లి తిరిగి నమ్మకాన్ని కూడగట్టుకుంటే తిరిగి సీట్ పొందే అవకాశం ఉంది అంటూ సదరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పీకే. ఇక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పింఛన్ లు మరియు కొత్త రేషన్ కార్డు లను వెంటనే మంజూరు చేస్తే తెరాస విజయం తధ్యం అంటూ పీకే టీం చెప్పింది.