తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి లో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇదే లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడి ఉందా.. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఏఐసీసీ దూతలకు సమర్పించిన రిపోర్టులో ఏముంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే బలమైన ఆర్థిక రాజకీయ నేపథ్యమున్న పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డిని.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది. బిజెపి నుంచి మరో బలమైన నేత ఈటల రాజేందర్ కూడా బరిలో ఉన్నారు.
కాగా కదా మల్కాజ్గిరి విజయం పై బిజెపి కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాన మోడీ ఓ దఫా ప్రచారం నిర్వహించి వెళ్ళారు కూడా. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో ఎన్నికల రేసులో కాంగ్రెస్కు వెనకబడి ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రచారంలో దూకుడు పెంచాలని స్థానిక నేతలను కలుపుకొని కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగాలని ఇటీవల పార్టీ సమావేశంలో సునీల్ కొనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసి వేణుగోపాల్ నేతలకు సూచించారట. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసేందుకు అందరు దోహదం చేయాలని.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారట. అయితే స్థానికులను కాదని స్థానికేతర నేత అయిన సునిత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల ఇక పార్టీలోని ఇతర నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుందట. ప్రచార సమయంలో ఆమెకు సహాయ నిరాకరణ జరుగుతుంద. ఇలా కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టాలంటే రేవంత్ బరిలోకి దిగితేనే సెట్ అవుతుందని మిగతా కేడర్ అభిప్రాయపడుతున్నారట.