ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర రవాణా,
బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం
ప్రభాకర్ ఫైర్ అయ్యారు. నేడు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్
పేట గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే
ప్రధాని మోడీ నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చని చెప్పారని అన్నారు. దీనిబట్టి మోడీ ఏ విధంగా నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవచ్చని పొన్నం చెప్పుకొచ్చారు.
బీజేపీ వేల కోట్ల రూపాయల బాండ్లు తీసుకుందని విమర్శించారు.
శరత్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి నుంచి
బీజేపీ నేతలు రూపాయలు ఐదు కోట్లు తీసుకొని లిక్కర్ కేసులో బెల్ ఇప్పించారని మండిపడ్డారు.
బీజేపీ పార్టీ మరొక వ్యక్తి నుంచి కూడా 100 కోట్ల రూపాయలను లంచంగా పుచ్చుకొని కాంట్రాక్ట్ వచ్చేలా చేసిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం
బీజేపీ ఇలా తప్పుడు దారిలో వెళ్తూ విరాళాలు సేకరిస్తుందని
మంత్రి తెలిపారు.
దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి బీజేపీ బాగోతం బయట పెట్టిందని చెప్పుకొచ్చారు. సురక్షితమైన పాలన కోసం ప్రజలందరూ
ఇండియా కూటమిని ఎన్నుకోవాలని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్లే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా
ఇండియా కూటమి గెలుస్తుందని
మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.
ఈ దుష్ట పరిపాలనలో
ప్రధాని నరేంద్ర మోడీ పాలుపంచుకున్నారని విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు.రాష్ట్రంలో రాముడి దయతో సుపరిపాలన అందిస్తామని అన్నారు.బీజేపీ పార్టీని నమ్మి ప్రజలు మోసపోకూడదని తెలిపారు. సంక్షేమ పరిపాలన కోసమై ప్రజలు ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని
మంత్రి పోన్నం కోరారు.ఇండియా కూటమి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యం అని పొన్నం
ప్రభాకర్ చెప్పుకొచ్చారు.