![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ka-paul-f04a637e-aedd-49d3-b95c-2e3f23f6b116-415x250.jpg)
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాను గతంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 5 కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలకు సంబంధించినదన్నారు. దీనిని విక్రయిస్తుంటే రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక విక్రయ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత స్పష్టం చేశారు. గతంలో తాను నిరాహార దీక్ష చేపట్టినప్పుడు విరమించాల్సిందిగా పలువురు మంత్రులు తనకు ఫోన్ చేశారన్నారు. అయినప్పటికీ దీక్ష కొనసాగించానన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ విక్రయించే ప్రణాళికలను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఎంపిలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని గతంలో తాను పిలుపునిచ్చానన్నారు. అయితే ఏపీలోని రాజకీయ నేతలు దీనికి ముందుకు రాలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ రూ.8 లక్షల కోట్లు అయితే కేంద్రం రూ.4 వేల కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిని ఆపేందుకు తనను ఎంపీగా గెలిపించాలని విశాఖ ప్రజలను ఆయన కోరారు.