జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని తను పిఠాపురం నుంచి పోటీ చేయడంతో పాటు పార్టీ తరపున 20 మంది అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారు. అయితే రెండు పడవల ప్రయాణం పవన్ ను ముంచేస్తోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్  పూర్తిస్థాయిలో సినిమాలకు దూరమవుతానని ప్రకటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
 
హీరో విజయ్ ను చూసి పవన్ కళ్యాణ్ మారాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హీరో విజయ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత పూర్తిస్థాయిలో సినిమాలకు  దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి గతంలో ఈ తరహా ప్రకటనలు వచ్చినా ప్రస్తుతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఉండటంతో పవన్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
 
పవన్ కళ్యాణ్ కనీసం ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజాసేవకు పరిమితమవుతానని చెబితే కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుంది. చంద్రబాబు, జగన్ లలో ఎవరూ కూడా పార్ట్ టైమ్ రాజకీయాలు చేయడం లేదు. ఈ ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమైనా ఈ ఇద్దరు నేతల పార్టీలకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కనీసం సగం స్థానాలలో అయినా ఆశించిన ఫలితాలను సాధిస్తారేమో చూడాల్సి ఉంది. రాయలసీమలో జనసేన పరిమిత స్థానాలలో పోటీ చేస్తుండగా ఇక్కడ ఆ పార్టీకి అనుకూల ఫలితాలు రావడం అయితే సులువు కాదని సమాచారం అందుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయడం లేదని తెలుస్తోంది. జనసేన పార్టీ ఒకింత గందరగోళంతో రాజకీయాలు చేస్తోందని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: