ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హడావుడి మొదలైంది.. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అధికార ప్రతి పక్ష నేతలు నామినేషన్ లు వేయడం కూడా మొదలు పెట్టారు..ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు మరింతగా పెంచారు.. ఈ సారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.. అధికారమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఒకరి పై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఊహించని హామీలు ఇస్తూ నిత్యం ప్రజలలో మమేకం అవుతున్నారు.. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే సీటు దక్కిన నేతలు ఆ నియోజకవర్గంలోని పార్టీకి చెందిన కార్యకర్తలకు,నేతలకు విందులు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేయాల్సిందిగా అక్కడి నేతలు కోరారు.అలాగే ఆ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చడం వంటివి చేసారు.ఇక రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 

ఎన్నికలలో కీలక ఘట్టం డబ్బు పంపిణి.. ఎన్నికలు చివరకి చేరుకున్నాక డబ్బు పంపిణీ కష్టం అవుతుంది.. అలాగే డబ్బు పంపినిని అరికట్టడానికి పలు అధికారులను బదిలీ చేసి కొత్త వారిని నియమించడం జరిగింది. దీనితో డబ్బు పంపిణీకి ఇబ్బంది కలగకుండా ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంబంధిత కేంద్రానికి డబ్బును తరలిస్తు సీక్రెట్ డబ్బు పంపిణీ ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ కొన్ని నియోజకవర్గాలలో డబ్బు పంపిణీ మొదలు పెట్టినట్లు సమాచారం. కూటమి మాత్రం ఇంకా డబ్బు పంపిణీ మొదలు పెట్టలేదు.. ఒక్కో ఓటుకి ప్రతి అభ్యర్ధికి 2000 రూపాయలు వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. గట్టి పోటీ వున్న నియోజకవర్గంలో మాత్రం ఈ సారి ఓటు రేటు పెరిగే అవకాశం ఉంది. ఓటరును ఆకట్టుకోవడానికి నేతలు ఈ సారి మరింత భిన్నంగా గిఫ్ట్స్,డబ్బులు ఇవ్వనున్నారు. అయితే ఎన్నికల నిఘా వర్గం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో నేతలను మానిటర్ చేస్తుంది.డబ్బు పంపినీని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: