![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-general-elections820bf255-9f30-4d31-b60c-092b4754bd4e-415x250.jpg)
దేశంలో మొదటి దశ లో 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.. మొదటి దశ తో పోలిస్తే.. బీజేపీ కి రెండో దశ, మూడో దశ ఎంతో ముఖ్యం.దీంతో.. తమ ఓటు బ్యాంకును సమీకరించుకోవటంతో పాటు.. వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.దీనితో తమ ఓటు బ్యాంక్ ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ప్రధాని మోడీ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చి ఉంటాయని తెలుస్తుంది.తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కాస్త ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.తాము టార్గెట్ చేసిన 400 ప్లస్ సీట్ల సాధన కష్టంగా మారుతుండటం. అలాగే 370 స్థానాలు ఖాయమన్న మాటపై కూడా సందేహాలు వ్యక్తమవుతుండటం మోదీ గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తుంది.