![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/secunderabad-78e3c913-24e5-4ce5-8d0f-9076d9c377c9-415x250.jpg)
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఆ పార్టీకి స్వతహాగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్ అసలు గెలుపు అవకాశాలపై ఏ మాత్రం ఆశ లేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రచారం చూసి అసలు కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా తీగల పద్మారావు గౌడ్ను రంగంలోకి దిగింది. ప్రజల్లో ఉండే అభ్యర్థి, సౌమ్యుడు కావడంతో ఆయన కూడా ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరో వైపు దానం నాగేందర్ అయితే గెలుపుపై ఏ మాత్రం అంచనాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్లో దానం నాగేందర్ను కాంగ్రెస్ తప్పిస్తుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ప్రచారం ముమ్మరంగా సాగించడం లేదు. దానం స్థానంలో బొంతు రామ్మోహన్ సతీమణిని పోటీకి దించుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో గెలిచే స్థానంలో పార్టీ ఓటమి పాలవుతుందని అంతా భావిస్తున్నారు. సూరత్ తరహాలోనే సికింద్రాబాద్లో సైతం కాంగ్రెస్ చేజారుతుందని అనుమానాలు మొదలయ్యాయి.