![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ys-sunitha-jagan-sharmila-kadapa-politics3944b724-a9dc-4889-973a-cee8d209b315-415x250.jpg)
పులివెందుల నియోజకవర్గం నుంచి వెలిదండ్ల, పార్నపల్లె, ఎగువపల్లి తదితర ప్రాంతాలలో నిన్నటి రోజున సాయంత్రం మేమే రోడ్ షో నిర్వహించింది.. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ ..తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం కోసం ఐదేళ్లుగా తాను పోరాడుతూనే ఉన్నానని మీరైనా న్యాయం చేయండి అంటూ ప్రజలను దేహి అంటూ కోరుతోంది. మీ బిడ్డకు చాలా అన్యాయం జరిగిందని మీ దీవెనలు ఆశీస్సులు కావాలంటే ఎవరూ కూడా హంతకులకు ఓటు వేయద్దండి అంటూ పిలుపునిస్తోంది సునీత.
కడప ఎంపీ బరిలో నుంచి వైయస్ షర్మిలను గెలిపించుకుంటే కచ్చితంగా వివేక హత్య కేసుతో పాటు మన కష్టాలను కూడా తీరుస్తుంది అంటూ రోడ్డు షో లో భాగంగా మాట్లాడుతోంది సునీత. రోడ్డు షోలో పులివెందల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ద్రవ కుమార్ రెడ్డితో పాటు తులసి రెడ్డి తదితర నాయకులతో ఈ రోడ్డు షోని నిర్వహించింది. గత కొద్దిరోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో పదేపదే జగన్ , అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఉంటే ఇటీవలే కడప కోర్టు కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకూడదంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా వాటిని లెక్కచేయకుండా ఇప్పుడు రోడ్డు షో లో సునీత ఇలా మాట్లాడుతూ కనిపిస్తోంది.