![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/teen-maar-mallanna-jivana-prayanamidena77c41da7-db71-44ef-8f2a-5a0430b0876f-415x250.jpg)
జర్నలిస్టు నుంచి రాజకీయం:
మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1983 జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధవపురం గ్రామంలో జన్మించాడు. అలాంటి మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు హైదరాబాద్ జేఎన్టీయూ నుండి 2009లో ఎంబీఏ పట్టా అందుకున్నాడు. ఆయన చదువుకున్న రోజుల్లో నుంచే ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి. కాలేజీలో ఎలాంటి తప్పులు జరిగిన ప్రశ్నించేవాడు. అలాంటి మల్లన్న ఐ న్యూస్, ఎన్టీవీ వంటి ప్రముఖ టీవీ ఛానల్ లో కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. దీంతో ఈయన పేరు తీన్మార్ మల్లన్న గా మారిపోయింది. కొన్నాళ్లపాటు టీవీ ఛానల్ లో పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జర్నలిస్టుగా ఎంతో గుర్తింపు సాధించారు.