బీఆర్ఎస్ కు కంచుకోటగా మారిన ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండాను పాతింది. మొదటి అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ కాంగ్రెస్ విజయా దుందుభి మోగించింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం సీతక్కను ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. దీంతో పార్టీ వ్యవహారాలన్నీ సీతక్కనే చూసుకుంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 మంత్రి పదవి కోసం జిల్లా నేతల్లో గడ్డం బ్రదర్స్ వివేక్ వినోద్ పోటీపడ్డారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీలు మారిన వివేక్ కు, ఎన్నికలు వచ్చినప్పుడే కనిపించే వినోద్ కు మంచి పదవి ఇవ్వకూడదని క్యాడర్ ఆందోళన చేసినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ను కష్టకాలంలో కూడా వీడని ప్రేమ్ సాగర్ రావును మంత్రిని చేయాలని క్యాడర్ అధిష్టానాన్ని కోరింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవిని ఓల్డ్ లో పెట్టారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకి ఎంపీ టికెట్ కోసం గడ్డం బ్రదర్స్ మంత్రి పదవిని త్యాగం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

 దీంతో జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి పక్క అనే ప్రచారం జరుగుతుంది. గతంలోనే బీఆర్ఎస్ కు అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని భావించినప్పటికీ ఫస్ట్ లిస్టులో ఇద్దరు రావులకు మంత్రి పదవి దక్కడంతో ఆలోచనలు పట్టినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ ఫుల్ ఆయనకు మంత్రి పదవి ఖరారు అయ్యిందని.. గడ్డం బ్రదర్స్ కొడుకు కోసం ఆ పదవిని త్యాగం చేశారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ వినిపిస్తున్న వార్తలు మాత్రమే.. అసలు అధిష్టానం మనసులో ఏముంది అనే విషయం ఇప్పటికీ వెల్లడించలేదు. ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి దక్కుతుందని ఏ నాయకుడు మాట్లాడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: