![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap60be1fd8-2af6-4a3c-86ef-5d6e6bc59ab6-415x250.jpg)
బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు ఆ అభ్యర్థులకు ఓట్లు పెరిగి నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చట. CSDS ఎలెక్టోరల్ పాలిటిక్స్పై పరిశోధనలు చేసే లోక్నిటి ప్రాజెక్టుకు కో డైరెక్టర్ గానూ సంజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనతో డిజిటల్ న్యూస్ మీడియా సంస్థ ఎడిటర్G కు చెందిన సీనియర్ జర్నలిస్టు విక్రమ్ చంద్ర తాజా రాజకీయాలపై మాట్లాడారు. బీజేపీ ఏయే రాష్ట్రాల్లో పోటీ చేస్తుందో ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల గెలుపు గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే ఈ అంశాల గురించి మాట్లాడుతూ జనవరి - ఫిబ్రవరి నెలలలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆ తర్వాత చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో బీజేపీ సింగిల్ గా 373 సీట్లను గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చర్చ జరిగిందని, కానీ ఇప్పుడు ఎన్డీఏ సహాయంతో నైనా బీజేపీ గెలుస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన తెలిపారు. జాతీయస్థాయిలో ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవని, ప్రాంతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రమే పార్లమెంటు గెలుపోటములను నిర్ణయిస్తాయని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.