ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు గెలుస్తున్నట్లు ఎలాంటి వార్తాలను ప్రచురించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అవి టీడీపీ కూటమి గెలవబోతోంది అని వార్తలను రాయడం మొదలుపెట్టాయి. కేంద్రంలో మాత్రం బీజేపీ ఓడిపోవచ్చు అని కథనాలను ప్రచురిస్తున్నాయి. రీసెంట్‌గా రాజకీయ నిపుణులు, సెఫాలజిస్ట్ సంజీవ్ కుమార్ వేసిన అంచనాలను ఈ పేపర్లు ప్రముఖంగా హైలెట్ చేస్తూ ప్రచురించాయి. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) అనే ఢిల్లీలోని ప్రముఖ పరిశోధనా సంస్థకు చెందినవారే ఈ సంజీవ్ కుమార్. ఆయన ప్రకారం, బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు కూడా లేదు.

బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు ఆ అభ్యర్థులకు ఓట్లు పెరిగి నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చట. CSDS ఎలెక్టోరల్ పాలిటిక్స్‌పై పరిశోధనలు చేసే లోక్‌నిటి ప్రాజెక్టుకు కో డైరెక్టర్ గానూ సంజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనతో డిజిటల్ న్యూస్ మీడియా సంస్థ ఎడిటర్‌G కు చెందిన సీనియర్ జర్నలిస్టు విక్రమ్ చంద్ర తాజా రాజకీయాలపై మాట్లాడారు. బీజేపీ ఏయే రాష్ట్రాల్లో పోటీ చేస్తుందో ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల గెలుపు గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే ఈ అంశాల గురించి మాట్లాడుతూ జనవరి - ఫిబ్రవరి నెలలలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆ తర్వాత చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకొచ్చారు.

 ఆ సమయంలో బీజేపీ సింగిల్ గా 373 సీట్లను గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చర్చ జరిగిందని, కానీ ఇప్పుడు ఎన్‌డీఏ సహాయంతో నైనా బీజేపీ గెలుస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన తెలిపారు. జాతీయస్థాయిలో ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవని, ప్రాంతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రమే పార్లమెంటు గెలుపోటములను నిర్ణయిస్తాయని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap