![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/modi-1a416d88-711b-4b68-867b-285f9034fe54-415x250.jpg)
ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పేపర్లు జర్నలిజంతో పాటు ఎడిటోరియల్ విభాగాన్ని బాగా దిగజార్చాయి. రాజకీయ నాయకులే ఎదుటోరియల్ కాలం రాసే లాగా స్వేచ్ఛను కూడా అందిస్తున్నాయి ఈ పత్రికలు. దీని ఫలితంగా ఏమైంది? విశ్వసనీయత, నిష్పాక్షికత అనేవి మంట కలిసిపోయాయి. ఒక ఏపీ రాష్ట్రంలోనే కాదు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జాతీయంగా కూడా మీడియా అనేది డబ్బుల కోసం వెంపర్లాడుతోంది కానీ ప్రజలకు నిజాన్ని నిజంగా చూపించేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే అలాగని మీడియాని పూర్తిగా బహిష్కరించగలమా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో జరిగే సమాచారాన్ని వెంటనే కళ్ళకు కట్టినట్లు చూపించగలరు. ఒకరికి కొమ్ముకాస్తూ వార్తలు వడ్డించడం వేరు అలాగే సామాన్యుల గురించి మిగతా అంశాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వేరు.
ఆ అప్డేట్స్ అనేవి సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి చాలా అవసరం కాబట్టి పత్రికలు, డిజిటల్ న్యూస్ మీడియా సంస్థలు మనకు కావాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది మీడియా వెంటనే తెలియజేస్తుంది అయితే అందులో నిజం ఉందా లేదంటే అబద్ధం ఉందా అనేది మాత్రం తెలపడం లేదు. పుకార్లు వస్తున్నాయంటూ వెంటనే వార్తలు రాసి వడ్డిస్తున్నారు అందులో నిజం ఉన్నది మాత్రమే మనకి తెలియజేస్తే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుంది. వార్తలు రాయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు టైం వేస్ట్ అలాగే ఒక వార్త నిజం అంటూ రాసుకోవచ్చు తర్వాత అది అబద్ధం అంటే ఎవరికీ వార్తలు చదవబుద్ధి కాదు. ఇక కొన్ని మీడియాలో రాజకీయ నాయకులకు తలొగ్గి వారి అరాచకాలను ఎక్కడా కూడా చూపించడం లేదు. ఈ తీరు అనేది మారాలి మారుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే.