తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత , బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా కూడా ముందు నుంచి ప్రధాన పోటీ మాత్రం బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేకన్నా కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యే హోరాహోరీగా కొనసాగుతోంది.
ఇక ఉదయం 10 గంటలకు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 4 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. మూడో రౌండ్లో రెహమత్ నగర్, వెంగళరావు నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే పోస్ట్ ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తో పాటు తొలి రెండు రౌండ్ల లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంటే ... మూడో రౌండ్ లో అనూహ్యంగా బీఆర్ఎస్ లీడింగ్ లోకి వచ్చింది. మూడో రౌండ్లో బీఆర్ఎస్కు 201 ఓట్ల లీడింగ్ లోకి వచ్చింది. కేవలం మూడో రౌండ్ వరకు చూసుకుంటే మాత్రమే బీఆర్ ఎస్కు స్వల్ప ఆధిక్యం వచ్చింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి