ప్రపంచ దేశాల్లో ఇస్లాం మతానికి సంబంధించిన దేశాలు అనేకం ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాకిస్తాన్. పూర్తిగా ఈ దేశంలో ఇస్లాం నమ్మేవారి జనాభా ఉంటారు. ఇక ఇక్కడే కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా  ఇస్లాం నమ్మే ప్రజలు జీవిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారతదేశం. ఇండియాలో కూడా ఎక్కువమంది ముస్లిం జనాభా కలిగి ఉన్నారు. వీరంతా ఇస్లాం మతాన్ని నమ్ముతారు. అలాంటి ఈ తరుణంలో అమెరికా కూడా ఇస్లామీకరణ వైపు అడుగులు వేస్తోందని తెలుస్తుంది. ఇంకో 10 నుంచి 20 సంవత్సరాల్లో అమెరికాలో ముస్లిం జనాభా పెరిగి ఇస్లామీకరణ జరుగుతుందని సీనియర్ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా న్యూయార్క్ మేయర్ గా మందాని ఎన్నిక అయ్యాక, అమెరికా పోలీసులు ఒక కొత్త కాన్సెప్టును తీసుకువచ్చారు. 

హిజాబ్ ధరించడం ఎలాగో అమెరికన్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే అమెరికాలో ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు కదా..వాళ్లకి ట్రైనింగ్ ఎందుకు ఇస్తారని చాలామందికి డౌట్ రావచ్చు.. ఈ మధ్యకాలంలో అమెరికాలో పరిస్థితులు మారుతున్నాయి. ఇస్లామీ కరణ మతం వైపు అడుగులు వేసే వారిని, ఫ్రీగా వదిలిపెట్టి, నమాజులు చేయడానికి కూడా ఫ్రీడమ్ ఇస్తున్నారు. అంతే కాదు చాలామంది ముస్లింలకు చెందిన యువతీ, యువకులు ఇతర మతస్తులను పెళ్లిళ్లు చేసుకొని ఇస్లాం మతంలో కలిపేసుకుంటున్నారు.

అయితే ఇతర మతాల నుంచి వచ్చిన అమ్మాయిలకు  హిజాబ్ ధరించడంపై ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో టెక్సాస్ లో  రెండు సంవత్సరాల కాలంలో 48 మసీదులు వచ్చాయని తెలుస్తోంది.   కొన్ని కొన్నిచోట్ల క్రైస్తవులు చర్చిలను నిర్వాహణ చేయలేక అమ్మేసుకుంటున్నారు.వాటిని ఇస్లాం మతస్థులు కొనేసి, మసీదులుగా మారుస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 2040 వరకు అమెరికా పూర్తిగా ఇస్లామీ కరణ మతం వైపు అడుగులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై అమెరికా సర్కారు స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదంటే  మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: