గత కొన్ని నెలల నుంచి ఎక్కువగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు సైతం బస్సు ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. బస్సులో ప్రయాణించాలంటే ఏమవుతుందని ఆందోళన చెందుతూ ,సేఫ్ గా గమ్యానికి చేరగలమనే నమ్మకం లేకుండా పోతోంది. ఆ మధ్య కర్నూలులో రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీ కొట్టి ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఇప్పుడు తాజాగా మరొక బస్సు కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో వెంటనే మంటలు చెలరేగాయి ఈ ఘటనలో సుమారుగా 17 మంది పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది.


ప్రైవేట్ ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ కి వెళ్తూ ఉండగా హైవే పైన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బస్సులో సుమారుగా 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది , అధికారులకు సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ బస్సును ఢీ కొట్టిన తర్వాతే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది.


ఈ బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరి కొంతమంది పరిస్థితి విషయంగానే ఉందని ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా మృతుల సంఘం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వారు ఏం జరిగిందని తెలుసుకునే లోపు బస్సుకు పూర్తిగా మంటలు కమ్మేశాయి. దీంతో వారు బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవ దహనం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: