ఇదిలా ఉండగా ఇటీవల టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి కుమారుడు..మాజీ రాజ్యసభ సభ్యుడు..టిడిపి నాయకుడు నందమూరి హరికృష్ణ మరణించడంతో..చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు హరికృష్ణ మరణాన్ని తన రాజకీయ మైలేజీ కోసం వాడేసుకున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు భజన చేసే పచ్చ మీడియా తో హరి పాడె మోసిన చంద్రబాబు అంటూ తనకు అనుకూలంగా కథనాలను ప్రసారం చేసింది. అయితే చంద్రబాబు తన రాజకీయ మైలేజీ కోసం చేసిన ఈ పని విమర్శల పాలు చేసింది. ఈ తీరు సంప్రదాయ విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హిందూ సంప్రదాయ పద్ధతుల ప్రకారం బాబు తీరు వివాదాస్పదం అవుతోంది.అదెలాగంటే.. వియ్యపు వారి పాడెను వియ్యంకులు మోయరనేది హిందూ సంప్రదాయం. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు హరి అంత్యక్రియల్లో వ్యవహరించాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు రాజకీయ మైలేజీకి చేసిన పనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.