నేడు జరుగుతున్న అసెంబ్లీ నభలలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఎంతో ముఖ్యమైన 'అమ్మ ఒడి' పధకం పై టీడీపి ఎమ్మెల్ల్యె వాసుపల్లి గణేష్ కీలక వ్యాఖ్యలు చెసారు. 'అమ్మ ఒడి' అనేది చాలా మంచి ఆలోచన ఇది జనాల్లొకి వెళ్లాలని కొరుకుంటున్నాము కాని అది ఒకరికో ఇద్దరికో ఇస్తే సరిపొదు , ఇది అమ్మ ఒడా లెక సవతి అమ్మ ఒడా అని ఘాటుగా మాట్లాడారు.
రాష్ట్రం లో 75 లక్షల మంది విధ్యార్దులు ఉండగా కెవలం 43 లక్షల మందికే ఇవ్వడాన్ని ఎమంటారు అని ప్రశ్నించారు. ఈ పధకం అందరికీ ఇస్తే బాగుంటుంది అలా కాకుండా సెల్ఫీ దిగటానికి కొంత మందికి ఇవ్వడం సరికాదు అని గణేష్ అన్నరు