సహజంగా మనకు ఎంతో ఇష్టం ఉన్నవాళ్లు మనల్ని మోసం చేస్తే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. అయితే ప్రస్తుత సమాజంలో ఒకరినొకరు మోసం చేసి.. వేరే వాళ్లతో ఎఫైర్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ప్రస్తుతం విచిత్రంగా తిరువనంతపురంలో ఓ ఘటన చోటుచేసుకుంది. పెంపుడు జంతువులను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. వాటికి ఏం జరిగినా తట్టుకోలేని వారు ఉంటారు.
అయితే తిరువనంతపురంలో ఓ వ్యక్తి ప్రానం కన్నా ఎక్కువగా చూసుకున్న కుక్కు మోసం చేసిందని నడిరోడ్డు మీద వదిలేశాడు. తాను ఎందుకు వదిలేశాడో కూడా ఆ కుక్కుమెడలో ఓ బోర్డ్ పెట్టాడు. విచిత్రంగా ఉంది కదూ..ఇంతకీ ఆ రీజన్ ఏంటో చూడండి.. తిరువనంతపురంలోని ఓ బిజీ రోడ్డులో పొమేరియన్ జాతికి చెందిన ఓ కుక్క అటు ఇటూ తిరుగుతోంది. ఎటు పోవాలో తెలియక తికమకపడుతోంది.
అది చూసిన కొందరు వ్యక్తులు ఆ కుక్కను దగ్గరకు తీసుకున్నారు. దాని మెడలో ఒక నోట్ వేళ్లాడటాన్ని గమనించి ఏంటో చదివారు. ఆ నోట్లో కుక్కకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. టాప్ బ్రీడ్కు చెందిన ఆ కుక్క చాలా మంచిదని దానిపై రాసుంది.కేవలం అరవడమే కాని కరవడం తెలియని దాని వయసు మూడేళ్లని, మిల్క్, బిస్కెట్, ఎగ్స్కు ఇష్టంగా తింటుందని దాని ఆహారపు అలవాట్లను వివరించారు.
అయితే ఆ కుక్క తమ పక్కింట్లోని మరో కుక్కతో ఎఫైర్ పెట్టుకుందని..దాన్ని తట్టుకోలేక వదిలేశానని పేర్కోన్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయినా కుక్కలను ఇలా చేస్తారా అని నెటిజన్లు తప్పుపడుతుంటే.. మరి కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.