తెలంగాణలో పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు సేవలను నిలిపేశారు. ఈ మేరకు నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్ లు ఉంచాయి. ఆసుపత్రులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో దాదాపు 242 ఆసుపత్రులలో ఇక సేవలను కొనసాగించలేమని చేతులెత్తేశాయి.
వీటిలో 15 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ నెల పది నుంచే సేవలు నిలిపివేశాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు సేవలు నిలిపి వేయాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించాయి. పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించే వరకు వైద్య సేవలు అందించలేమని అసోసియేషన్ లు అంటున్నాయి. ప్రధానంగా నాలుగు డిమాండ్ లను ప్రభుత్వం ముందుంచాయి ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు ఆసుపత్రి వర్గాలు. యునిలాటరల్ లో మార్పులు చేసి సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న ఆసుపత్రులను అందులో చేర్చి సరళతరమైన వైద్యం అందించేలా చూడాలంటున్నారు.
అలాగే బకాయిలు నిత్యం వచ్చేట్టు గ్రీన్ ఛానల్ లో పెట్టాలని ప్యాకేజీలను పెంచాలనే కోరుతున్నాయి. రాకేశ్ ప్రస్నిస్తు "బకాయిలు పేరుకుపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని నెట్ వర్క్స్ ఆసుపత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ అంటున్నారు. మేము ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు ఇది ఆఖరిసారి అని ఆయన అంటున్నారు. అలాగని మీరు 700-800 కోట్లు ఏదో ఉందంటున్నారు అదే మాకివ్వండి మాకందరికీ క్లియర్ అయిందనుకోండి ఆ 700-800 కోట్లతోనే మేం మొదలుపెట్టేస్తాం కానీ మా డ్యూస్ క్లియర్ అవ్వగానే మొదలు పెడితే నెక్స్ట్ పేమెంట్స్ ఎలా చేస్తారు.ఎందుకంటే మిగతా డబులు కూడా ఇవ్వాలని ఇది గ్రీన్ చానల్ లో పెట్టమని మా విన్నపం" అని రాకేశ్ తెలిపారు. ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న వారికి మాత్రం వైద్య సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు.కానీ ఈ పరిస్తితి ఇంకా ఉద్రిక్తం అయితే కనుక పూర్తి సేవలను రద్దు చేస్తామని ఆయన తన ఆవేదాన్ని వ్యక్తం చేశారు. దీనికి పూర్తి పరిష్కారాన్ని ప్రభుత్వం ఎలా ఇస్తుందో ఇక మన ఉచిత సేవలు కొనసాగుతాయో లేదో వేచి చూడాలి.