వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్ , భారత జట్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయ్ అని చెప్పాలి. కాగా ఈ నెల 23వ తేదీన ఈ రెండు జట్లు కూడా మరోసారి వరల్డ్ కప్ లో భాగంగా హోరాహోరీగా తలబడేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమి చవిచూసింది.  ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిథి కీలకమైన సమయంలో భారత బ్యాట్స్మెన్లను పెవిలియన్ పంపించి ఇక భారత ఓటమిని శాసించాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన షాహీన్  ఇక ఇప్పుడు మళ్లీ జట్టుతో చేరి ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు.


 ఇకపోతే గత ఏడాది ప్రపంచకప్ లో షాహిన్ ఆఫ్రిదిని ఎదుర్కోవడంలో విఫలం అయిన భారత బ్యాట్స్మెన్లు ఇక ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. షాహిన్  బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లకు సూచనలు సలహాలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అందరూ షాహిన్ ఆఫ్రిది  నుంచి టీమిండియా కు ప్రమాదం ఉంది అని వ్యాఖ్యానిస్తూ ఉంటే.. అటు మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు.



 టీమిండియా కు అసలు ప్రమాదం షాహిన్ అఫ్రీదితో కాదని హరీష్ రౌఫ్ తో అసలు సమస్య అంటూ తెలిపాడు  ఫుల్ స్వింగింగ్, ఫాస్ట్ బౌలింగ్లో ఆఫ్రిది అతడి అత్యుత్తమ ప్రదర్శనకు దగ్గరగా ఆడుతున్నాడు. అయితే ఈ ప్రపంచకప్ లో షాహిన్ రోహిత్ సేనను ఇబ్బంది పెట్టేంత ఆటగాడు ఏమీ కాదు అని నా అభిప్రాయం. కానీ టీమ్ ఇండియాకు అసలైన ప్రమాదకారి హరీష్ రౌఫ్ అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. కఠినమైన ఓవర్లలో బౌలింగ్ చేసి ఆటలో వైవిధ్యం చూపగల సామర్థ్యం అతనికి ఉంది అటు ఆకాష్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. కాగా హరీష్ రౌఫ్ ఇటీవల ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: