ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యూచర్ కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అన్నది గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఇక సారధ్య బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అన్న విషయంపై అందరూ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అయితే ధోని తర్వాత జడేజా కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన చెన్నై యాజమాన్యం చేతులు కాల్చుకుంది. గత ఏడాది జడేజా కెప్టెన్సీ లో దారుణంగా విఫలమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.


 ఒకవైపు ఆటగాడిగా మరోవైపు కెప్టెన్ గా కూడా రవీంద్ర జటేజ ఆకట్టుకోలేకపోయాడు అనే విషయం తెలిసిందే. చివరికి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకే అప్పగించడం గమనార్హం. దీంతో ఇక ధోని వారసుడిగా పిలుచుకునే జడేజాకు కెప్టెన్సీ చేసే అంత సీన్ లేదు అన్న విషయం అర్థమైంది. దీంతో ఇక జట్టులో ఎవరికి కెప్టెన్సీ అప్పగించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా  మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే ఇక  స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజు గైక్వాడ్ రూపంలో చెన్నై యాజమాన్యానికి ఒక ఆశా కిరణం లభించినట్లు తెలుస్తుంది.


 ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను ఋతురాజ్ గైక్వాడ్ కి అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఋతురాజుకు ఒకవైపు కెప్టెన్ ధోని నుంచి, మరోవైపు బ్యాటింగ్ కోచ్ మైక్ హాస్సి నుంచి కూడా మద్దతు ఉందట. ఏకంగా మైక్ హస్సి కెప్టెన్ గా మారితే బాగుంటుందని నేరుగా యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తోంది. రెండు సీజన్లా నుంచి ఋతురాజును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మైక్ హస్సి అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గ్రహించాడట. ఈ క్రమంలోనే యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తుంది. ఇక ఈ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ గా అతడు పరిణితి కనబరిచిన తీరు కూడా సీఎస్కే యాజమాన్యాన్ని ఆకర్షించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL