ఎన్నో ఏళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కెరియర్ కి ఇటీవల కాలంలో మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ఏది అంటే అది బింబిసారా అని చెప్పాలి. భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్ హిట్గా మారిపోయింది అని చెప్పాలి. కొత్త దర్శకుడు వశిష్ట ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమాను ఎంతో బాగా తెరకెక్కించాడు అని చెప్పాలి.. అయితే ఈ సినిమా ద్వారా హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇక ఈ ఏడాది అమిగోస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  అయితే ఈ సినిమా ఎందుకో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది.



 ఇకపోతే ప్రస్తుతం తన కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన బింబిసారా సినిమాకి ఇక సీక్వెల్ చేసేందుకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు కళ్యాణ్ రామ్. ఇక వశిష్ట దర్శకుడిగా బింబిసారా సీక్వెల్ ను తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర వార్తా ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. కొన్ని సృజనాత్మక కారణాలవల్ల డైరెక్టర్ వశిష్ట ఇక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది.



 అయితే ఇక ఇద్దరి మధ్య మరీ ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత విభేదాలు ఏమీ రాలేదని.. కానీ వశిష్ట కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా స్నేహపూర్వక వాతావరణం లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది నిజమైనదా కాదా అన్న విషయంపై అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించి ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో అని వేచి చూస్తున్నారు అని చెప్పాలి. కాగా బింబిసారా  సినిమాకి విఎఫ్ ఎక్స్ వర్క్ చేసిన అనిల్ పాడూరితో ఇక సీక్వెల్ సినిమాకు డైరెక్షన్ చేపించాలని అనుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్రబృందం క్లారిటీ ఇచ్చేంతవరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: