మరి తెలిసి చేస్తున్నారో లేకపోతే అనాలోచితంగా చేస్తున్నారో కానీ కుప్పం నియోజకవర్గంలోని తమ్ముళ్ళు చేస్తున్న పనివల్ల చంద్రబాబునాయుడు పరువు రోడ్డున పడేస్తున్నారు. కుప్పంకు మంచినీళ్ళని అందించటంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందంటూ కుప్పం రోడ్లపై నానా గోల మొదలుపెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నాలు చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందే. అధికారులు పట్టించుకోకపోతే నిరసనలు, ఆందోళనలు చేయాల్సిందే. దీన్ని ఎవరు తప్పుపట్టేందుకు లేదు. కానీ తప్పంతా తమ అధినేతలోనే పెట్టుకుని ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్న టీడీపీ నేతలను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.  కిందపడ్డా పై చేయి తనదే అన్నచందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరునే తమ్ముళ్ళు కూడా గుడ్డిగా ఫాలో అయిపోతుండటమే విచిత్రంగా ఉంది.




కుప్పంకు మంచినీటి సరఫరా రావటం లేదనేది తమ్ముళ్ళ ప్రధాన ఆరోపణ. ఇందులో నూరుశాతం నిజముంది. అయితే కుప్పంకు నీటి సౌకర్యం ఇప్పటివరకు లేదంటే అందుకు బాధ్యత ఎవరిది ? 1989 నుండి కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నది చంద్రబాబునాయుడే కదా. గడచిన 30 ఏళ్ళలో  ఎంఎల్ఏ గా మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా కుప్పం నుండి చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా ఎంఎల్ఏ అయిన వాళ్ళు కూడా తమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మంచినీటి సౌకర్యం, రోడ్లు లేదంటే ఇతర సౌకర్యాలు కావాలని పదే పదే ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు. మరి మంత్రిగా ఉంటే జిల్లాలో ముందు తమ నియోజకవర్గం డెవలప్మెంట్ చూసుకున్న తర్వాతే జిల్లా డెవలప్మెంట్ గురించి ఆలోచించే మంత్రులు కూడా ఉన్నారు. అంటే ఎంఎల్ఏ అయినా మంత్రయినా ముందు తమ నియోజకవర్గం, తమ జిల్లా అభివృద్ది మీద దృష్టి పెడతారు. కానీ చంద్రబాబు ఏమి చేశారు ?




ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ నుండి కుప్పంకే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు కనీస అవసరమైన మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారంటే అది ఎంత అవమానం.  ఈ 30 ఏళ్ళల్లో 15 ఏళ్ళు సిఎంగానే ఉన్నారు కదా.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురం నుండి కాలువలు తవ్వించి చిత్తూరు జిల్లాలోకి నీటి సౌకర్యం ఏర్పాటు చేయలని కష్టపడ్డారు. చాలా వరకు కాలువల తవ్వకాలు కూడా పూర్తయిపోయాయి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మరణించటంతో పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయిన తర్వాత మళ్ళీ కాలువ పనులు జరిగాయి.  2014 ఎన్నికల కారణంగా తర్వాత మళ్ళీ ఆగిపోయాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏమి చేశారు ? అనంతపురం జిల్లా మీదుగా చిత్తూరు జిల్లాలోని కాలువ పనులను వెంటనే ఎందుకు పూర్తి చేయించలేదు ?




అధికారంలోకి రాగానే చంద్రబాబు గనుక తన నియోజకరవర్గం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుంటే మంచినీటి సౌకర్యానికి ఇబ్బంది ఉండేది కాదు కదా. అప్పట్లోనే చంద్రబాబు మంచినీటి సరఫరా విషయంలో శ్రద్ధ చూపుంటే ఇఫుడు తమ్ముళ్ళ రోడ్లపైకి వచ్చే అవసరం ఉండేది కాదు. ఇక్కడే తమ్ముళ్ళ వల్ల చంద్రబాబు చేతకాని తనం బయటపడింది.  కుప్పం డెవలప్మెంట్ పై చంద్రబాబు ఎంతమాత్రం దృష్టి పెట్టాడనే విషయంపై జనాలు మాట్లాడుకుంటున్నారు.  అంటే చంద్రబాబు పరువును తమ్ముళ్ళే రోడ్డు మీదకు లాగేశారని అర్ధమవుతోంది. మరి మంచినీటి సౌకర్యం పేరుతో ఆందోళనలకు తమ్ముళ్ళే ప్లాన్ చేశారో లేకపోతే వెనకనుండి చంద్రబాబే ప్లాన్ చేశారో తెలీటం లేదు. ప్లానింగ్ ఎవరిదైనా మొత్తానికి పోయిన పరువు మాత్రం చంద్రబాబుదే అనటంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: