ప్రత్యర్ధులపై తెలుగుదేశంపార్టీ నేతలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏమాత్రం అవకాశం దొరికినా చంద్రబాబునాయుడు, లోకేష్ నుండి కిందస్ధాయి కార్యకర్త వరకు టార్గెట్ పెట్టుకుని మరీ రచ్చ రచ్చ చేసేస్తారు. అలాంటిది గడచిన రెండు రోజులుగా చంద్రబాబు, లోకేష్ నోళ్ళు ఓ విషయంలో అస్సలు తెరుచుకోవటమే లేదు. అదేమిటంటే తండ్రి, కొడుకుల గురించి ప్రత్యేకంగా పార్టీ భవిష్యత్తు గురించి స్వయంగా పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదని స్వయంగా అచ్చెన్నే స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో వాళ్ళిద్దరు అంటే చంద్రబాబు+లోకేష్ బాగుంటే అసలు పార్టీకి ఈ పరిస్ధితి ఎందుకు వస్తుంది ? అంటు అచ్చెన్న ఓ ప్రశ్నను సంధించారు.
నిజానికి అచ్చెన్న మాట్లాడింది నాలుగు గోడల మధ్య. ఎక్కడో టిఫిన్ తింటు చాలా లీజర్ గా కూర్చుని చట్నీ వేసుకుంటు వెంకట్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకు అచ్చెన్న జవాబిచ్చారు. వెంకట్ అనే వ్యక్తి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై తనలోని బాధనంతా బయటకు కక్కేశాడు. ఆ సందర్భంగా లోకేష్ ను ఏకవచనంతోనే సంబోధించాడు. పై ముగ్గురిని వెంకట్ అనేసి మాటలంటుంటే అచ్చెన్న కనీసం వారించలేదు. వారించకపోగా పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదని కామెంట్ చేయటమంటే మామూలు విషయం కాదు. పార్టీ భవిష్యత్తుపై తన మనసులోని మాటనే అచ్చెన్న బయటపెట్టినట్లు అర్ధమైపోతోంది.
మరి డైరెక్టుగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అంతటి మాటను అనేసిన తర్వాత చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎందుకని మాట్లాడలేదు. చంద్రబాబు, లోకేష్ ప్రచారంలో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడా అచ్చెన్న మనసులోని మాట గురించి మాత్రం ప్రస్తావించటంలేదు. జగన్ పై ఇద్దరు ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రపంచంలోని ఎక్కడెక్కడి విషయాలనో ప్రస్తావిస్తారు కానీ తమ పార్టీ సీనియర నేత, అధ్యక్షుడు తమపై చేసిన కామెంట్ల గురించి మాత్రం ఎందుకని మాట్లాడటం లేదు. పోనీ బహిరంగంగా మాట్లాడలేకపోయినా యాక్షనన్నా తీసుకునుండాలి కదా ? తీసుకున్నట్లు ఎక్కడా కనబడలేదు. అంటే అచ్చెన్న దెబ్బ తండ్రి, కొడుకులపైన మామూలుగా పడినట్లు లేదు. మరిపుడు పడిపోయిన నోళ్ళు ఎప్పుడు లేస్తాయో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి