ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,10.12.2019 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: 16C°-23℃°
• నిన్న 73,331 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు
₹: 3.30 కోట్లు.
• నిన్న 15,211 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
• శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
అయ్యప్ప స్వామి : “ముద్రకాయ” విశిష్టత
గమనిక:
• 2020 మార్చి నెలకి సంబంధిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ₹:300 కోటాను ఈరొజు టిటిడి ఆన్లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్ట్ ఆఫీస్ ల్లో టికెట్లను విడుదల చేయ నున్నారు భక్తులు బుక్ చేసుకోవచ్చు.
# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.
• నేడు తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర,
• రేపు కార్తీక దీపోత్సవం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ దత్త జయంతి.
• 17న ధనుర్మాసం ప్రారంభం.
• 25న శ్రీతొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
• 26న అధ్యయనోత్సవం,సూర్యగ్రహణం.
వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.