ఇంట్లో ప్రతిరోజూ..గొడవలు..తగాదాలు..అశాంతి.. వాతావరణం వుంటే..ఆయా ఇళ్లలో పూజా కార్యక్రమాలు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని పండితులు, పురోహితులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఏదైనా ఇంట్లోగానీ లేదా ఎవరితోనైనాగాని ఎల్లప్పుడూ అశుభం జరగడం, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే... అప్పుడు వారి గ్రహస్థితిలో ఏవో మార్పులు వున్నాయిని తెలుపుతారు జ్యోతిష్యులు.

 



అప్పుడు వాటికి సంబంధించిన యజ్ఞాలు, శాంతులు, జపాలు చేయిస్తే.. వాటి ప్రభావం తగ్గుతుందని శాస్త్రాల ప్రకారం చెబుతుంటారు. అయితే ఇలా కాకుండా సాధారణంగా ఏదైనా ఒక పని నిర్వహించాలనుకున్నప్పుడు అది సవ్యంగా జరగకపోతే.. ఏవైనా ఆటంకాలు ఎదురయినప్పుడు గాని, ఇతరత్రా దోషాలు ఏవైనా వుంటే.. వాటి నుంచి బయటపడడానికి వివిధ దేవతా స్తోత్రాలను కూడా పఠించవచ్చునని పురోహితులు వెల్లడిస్తున్నారు.

 

 

రోజూ ఇంట్లో గొడవలు ఉంటే.. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు జపించాలని పెద్దలు చెబుతున్నారు. ఈ స్త్రోత్ర పఠనం కారణంగా.. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’’ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: