భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే విషయం ప్రపంచానికంతటికీ తెలుసు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు మనల్ని ఇప్పటికీ గౌరవిస్తూ ఉంటాయి. అందులోనూ ఇక్కడ హిందూ దేవాలయాలు చాలా పురాతనమైనవి. ఎంతో విశిష్టత కలిగి ఉన్నవి.ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన, ప్రసిద్ధి గాంచిన దేవాలయాలను కొన్ని వేల సంఖ్యలో మన దేశంలో చూడొచ్చు. కేవలం హిందూ మతంలోని దేవాలయాలు మాత్రమే కాదు.. ఇతర మతాలలోని దేవాలయాలు కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలుగా ప్రజలందరూ భావిస్తారు. ఇలాంటి దేవాలయాల్లో అడుగుపెట్టే మనకు అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి.. దేవుడిని ఎలా పూజించాలనే విషయాలను పండితులు, పెద్దలు, పూజారులు తరచుగా చెబుతూ ఉంటారు. కానీ దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలను చాలా తక్కువ మందే చెబుతారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు. దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజారులు, భక్తులు, అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం.. చెప్పులు, బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు. ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.

దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన వంటి పనులు చేయకూడదు. ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు. ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: