ఓ వైపు కొన్ని దేశాలు పదుల సంఖ్యలో బంగారు పతకాలు, వెండి పతకాలు, కాంస్య పతకాలు ఎగరేసుకు పోతున్నాయి. అన్ని రకాల క్రీడా విభాగాల్లో కూడా అద్భుతంగా సత్తా చాటుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక్కటంటే ఒక్కటే పథకాన్ని గెలిచింది అని చెప్పాలి. అది కూడా బంగారు పతకం కాదు కేవలం సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది భారత్. ఈసారి ఎంతో మంది క్రీడాకారులు భారత్కు పతకాలు తెస్తారు అని భావించినప్పటికీ చాలామంది నిరాశపరిచారు. ఇక ఇప్పుడు భారత ప్రేక్షకుల అందరి ఆశలు కూడా ఒకే ఒక్క అథ్లెట్ పై ఉన్నాయి. ఆమె ఎవరో కాదు తెలుగు తేజం పీవీ సింధు.
గతంలో జరిగిన ఒలంపిక్స్ లో ఇక అందరూ నిరాశపరుస్తున్న సమయంలో అద్భుతంగా రాణించిన పీవీ సింధు చివరికి కాంస్య పతకాన్ని సాధించి తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టింది ఇక ఇప్పుడు టోక్యో ఒలంపిక్స్ లో కూడా సత్తా చాటుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది పీవీ సింధు. ఇటీవల వరుస విజయాలతో సెమీఫైనల్కు చేరుకుంది. ఇటీవలే సెమీ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తై జూ (చైనీస్) క్రీడాకారిణితో తలపడనుంది. ఇక ఈ పోటీ ఎంతో టఫ్ మ్యాచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వీరిద్దరి మధ్య 18 సార్లు పోటీ చేయగా పి.వి.సింధు 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఏడాదిలో 15 మ్యాచ్లు ఆడిన తై జు 12 మ్యాచ్ లలో విజయం సాధించింది అయితే అటు చైనా క్రీడాకారిణి కూడా ఇప్పటివరకు ఒలింపిక్స్ లో పతకం సాధించలేదు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో టఫ్ మ్యాచ్ గా మారబోతుంది.