ప్ర‌పంచ క‌ప్ టీ 20 -2021 క్రికెట్ టోర్న‌మెంట్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య పాకిస్తాన్ లేదా ఇంగ్లండ్ ఈ సారి ప్ర‌పంచ క‌ప్ కొడ‌తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ పాకిస్తాన్‌, ఇంగ్లండ్ రెండూ కూడా సెమీస్‌లో ఇంటికి వెళ్లి పోయాయి. అనూహ్యంగా మ‌రో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు అయిన ఆసీస్‌, న్యూజిలాండ్ ఫైన‌ల్స్ కువెళ్లాయి. ఈ ఫైన‌ల్స్ స‌మ‌రంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పై ఘ‌న‌విజ‌యం సాధించి స‌గ‌ర్వంగా తొలిసారి టీ 20 ట్రోఫీని ముద్దాడింది.

ఇదిలా ఉంటే ఎన్నో రంగాల్లో సెంటిమెంట్లు ఉన్న‌ట్టే క్రికెట్లో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సారీ టీ 20 ప్ర‌పంచ క‌ప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న వెంట‌నే కొంద‌రు ఓ కొత్త సెంటిమెంట్ ను బ‌య‌ట‌కు తీశారు. ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో లో మ‌న‌కు క‌నిపిస్తారు. అయితే ఆ ఫొటో లో ట్రోఫీకి ఎడ‌మ వైపు ఏ కెప్టెన్ అయితే ఉంటారో ఆ జ‌ట్టు ఓడిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. 2016 నుంచి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతూ వ‌స్తోంది.

2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు మోర్గాన్ ఉన్నాడు. ఆ టోర్నీ లో ఆ జ‌ట్టు ఓడిపోయింది. అలాగే 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ట్రోఫీకి ఎడమ ఉన్న కోహ్లీ జట్టు ఉంటే భార‌త్ ఓడిపోయింది. అలాగే 2019 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కేన్ విలియమ్స్‌న్ ఉన్నాడు. ఆ జ‌ట్టు కూడా తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్స్ లో ఓడిపోయింది.

ఇక 2021 లో  ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మళ్ళీ ట్రోఫీకి ఎడమ వైపు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఆ జ‌ట్టు కూడా ఫైన‌ల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మ‌రి ఈ సెంటిమెంట్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: