సాధారణంగా క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలోకి వచ్చాయంటే చాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అప్పట్లో మహేంద్రసింగ్ ధోని కి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయాయి.  మహేంద్ర సింగ్ ధోనీ దక్షిణాది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య లవ్ రిలేషన్షిప్ ఏకంగా సోషల్ మీడియాను ఊపేసింది. 2008లో ఐపిఎల్ స్టార్ట్ కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా  ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక అప్పుడు ఆ జట్టు ప్రచారకర్తగా లక్ష్మీ రాయ్  వ్యవహరించారు.


 ఇక ఈ సమయంలోనే ధోని లక్ష్మీరాయ్ మధ్య పరిచయం ఏర్పడింది. వీరిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. ఎన్నో రోజుల పాటు ఈ ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఇద్దరు డీప్ డేటింగ్ లో ఉన్నారు అంటూ ఎన్నో రకాల కథనాలు హల్చల్ చేశాయి. అయితే వీరిద్దరి మధ్య అనుబంధం ఎక్కువ కాలం సాగలేదు.2009లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అటు లక్ష్మీరాయ్ మాత్రం ఇప్పటి వరకు వివాహానికి దూరంగానే ఉంది.


 అయితే వీరిద్దరి ప్రేమ బంధం గురించి ఇప్పటివరకు ఎవరూ కూడా మీడియా వేదికగా మాట్లాడలేదు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధోనితో బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది లక్ష్మీరాయ్. ధోనీతో కొనసాగించిన రిలేషన్ తన జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది అంటూ లక్ష్మీరాయ్ తెలిపింది. ధోనీతో బ్రేకప్ జరిగి 12 ఏళ్లు గడిచిపోతుంది. ఈ విషయం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ధోని గురించి మీడియాలో ఏ చర్చ జరిగినా కూడా తన పేరును ప్రస్తావిస్తున్నారు అంటూ లక్ష్మీ రాయి వాపోయింది. ధోనికి పెళ్లయి పిల్లలు పుట్టిన కూడా ధోనీ తో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు అన్న బాధ తనకు మిగిలిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ధోని తర్వాత తనకు ఎంతో మందితో బ్రేకప్ అయిందని ఆ విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: