దాదాపు ఈ సంవత్సరంలో జరిగిన నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరిన మొదటి టోర్నీ ఇదే కావడం విశేషం. ఇప్పుడు అందరి చూపు ఈ రోజు జరగబోయే ఫైనల్స్ మీదనే ఉంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు దక్షిణాఫ్రికాకు చెందిన అన్ సెయింగ్ తో టైటిల్ కోసం పోటీ పడనుంది. అయితే సింధు కు ఈ క్రీడాకారిణితో మంచి రికార్డు లేదు. గతంలో సింధు తనతో తల పడిన రెండు మ్యాచ్ లలోనూ పరాజయం పాలయింది. వీరిద్దరి మధ్య జరగనున్న మూడవ మ్యాచ్ ఇది, కాబట్టి ఖచ్చితంగా అన్ సేయింగ్ ఫేవరేట్ అని చెప్పాలి. కానీ సంచలనాలకు మారు పేరైన పీవీ సింధు ను తక్కువ అంచనా వేయలేం.
ఈ సంవత్సరం ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఒక్క టోర్నీని గెలవకపోవడంతో సింధు ఎలాగైనా ఈ ఫైనల్ లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వరకు వెయిట్ చేయాల్సిందే.